Saturday, January 11, 2025

ప్రాతాదిసంధి

 *ప్రాతాది సంధి* 


'ప్రాతాదులు' అంటే ప్రాత,క్రొత్త,లేత,కెంపు,చెన్ను,మీదు,పూవు మొదలగు పదాలు.

సూత్రము.1

సమాసంబునం బ్రాతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగానగు (బాల వ్యా.సంధి.36)

ప్రాఁత మొదలైన పదాలతో రెండవ పదానికి సమాసం జరిగినపుడు 'ప్రాఁత'లోని మొదటి అచ్చు వరకు మిగిలి, తక్కిన అక్షరాలు లోపిస్తాయి.అంటే 'ప్రా'అనేది మాత్రమే మిగిలి ఉంటుంది.

(మిగతా పదాలలో కూడా మొదటి అక్షరం మాత్రమే మిగులుతుంది.)

ఇలా లోపించడం బహుళం కాబట్టి, కొన్ని పదాలలోని అక్షరాలకు లోపం  ఉండక పోవచ్చు.

ఉదాహరణకు,

ప్రాఁత+ ఇల్లు=ప్రాయిల్లు,ప్రాఁతయిల్లు

(ఇక్కడ 'త' లోపించినపుడు యడాగమం వచ్చినది.)

లేఁత+దూడ= లేదూడ,లేఁతదూడ

పూవు+రెమ్మ=పూరెమ్మ, పూవు రెమ్మ 

పై రెండు ఉదాహరణలు కర్మదారయములు, మూడవది తత్పురుషము.


సూత్రం 2.

లుప్తశేషమునకుం బరుషములు పరములగునపుడు నుగాగమంబగు.(సంధి.సూ.37)

పై సూత్రము ప్రకారము లోపించగా మిగిలిన అక్షరానికి పరుషాక్షరాలు (క,చ,ట,త,ప) పరమైనపుడు న కారం(న్) ఆగమం గా వస్తుంది.

ఉదా:

ప్రాఁత + కెంపు = ప్రాఁగెంపు

లేఁత + కొమ్మ = లేఁగొమ్మ

పూవు + తోఁట = పూఁదోట

మీఁదు + కడ = మీఁగడ

కెంపు + తామర=కెందామర

చెన్ను + తొవ = చెందొవ 

న కారం ద్రుతం కాబట్టి,ద్రుతానికి వచ్చే కార్యాలు ఇక్కడ వర్తిస్తాయి.

ప్రాఁత+ కెంపు ; ప్రా + కెంపు;(సూ.36) ప్రా+న్+కెంపు (సూ.37)

ప్రాన్+కెంపు (సూ.16),న కారం అరసున్న గా మారి ప్రాఁగెంపు(సూ.17) అవుతుంది.

అయితే ఇక్కడ ’ప్రాగెంపు' అనే రూపం ఒక్కటే ఉంటుంది.'ప్రాంగెంపు' , 'ప్రాన్గెంపు', 'ప్రానుగెంపు'  రూపాలు ఉండవు.

దీర్ఘంమీద నిండుసున్న రాదు.కాబట్టి 'ప్రాంగెంపు' రూపం ఉండదు.

ఈ సూత్రం వివరణలో వ్యవస్థిత విభాషచే ద్రుతమునకు సంశ్లేషంబు లేదు.అని చెప్పినందువల్ల 'ప్రాన్గెంపు' కాదు.సమాసాలలో ద్రుతానికి స్వత్వరూపం లేదు కాబట్టి 'ప్రానుగెంపు' అనే రూపం కూడా ఏర్పడదు.

36 వ సూత్రంలో బహుళము అని చెప్పినందువల్ల తొలియచ్చు మీది వర్ణములకు లోపం రానప్పుడు 'ప్రాంతకెంపు' అని ఉంటుంది.

మీఁగడ,కెందామర,చెందొవ అను రూపాలు ఏర్పడే పద్ధతి కూడా ఇదే.కానీ,ఈ మూడు పదాలలో లోపం నిత్యం.కాబట్టి, మీఁదుకడ,కెంపు తామర,చెన్నుతొవ అను రూపాలు ఏర్పడవు.

కెందామర,చెందొవ పదాలలో ద్రుతం నిండుసున్న గానే మారింది.

ఎందుకంటే, సంధి 22 వ సూత్రం ప్రకారం తొలి హ్రస్వం మీద సున్నయే గాని అరసున్న ఉండదు.

ఇక, 

'చెన్ను' శబ్దం సమాసం లో కాకుండా విడిగా ఉన్నప్పుడు అందము, విధము అనే అర్థాలను తెలుపుతుంది.సమాసంలో మాత్రం 'ఎఱుపు' అనే అర్థాన్ని ఇస్తుంది.

(చెందొవ=ఎఱ్ఱ కలువ)

(వ్యవస్థితవిభాష అంటే ఇది ఇక్కడ వస్తుంది,ఇది ఇక్కడ రాదు అనే నియమాలను ఏర్పరచిన విభాష. )


సూత్రం.3:

క్రొత్త శబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్నియెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు. (సంధి.సూ.38)


సమాసం లో వేరొక పదం పరమగునపుడు, 'క్రొత్త 'శబ్దంలో 'త్త' లోపించగా మిగిలి ఉన్న 'క్రొ' అక్షరానికి కొన్ని చోట్ల నకారం (న్) ఆగమం అవుతుంది.మరికొన్ని చోట్ల పరమైన హల్లునకు ద్విత్వం వస్తుంది.


క్రొత్త + చాయ = క్రొంజాయ

క్రొత్త + చెమట = క్రొంజెమట

క్రొత్త + పసిడి =  క్రొంబసిడి

క్రొత్త + కారు =  క్రొక్కారు

క్రొత్త + తావి = క్రొత్తావి 


'క్రొత్త' శబ్దం కూడా ప్రాతాదులలోనిదే.

ఈ సూత్రం ప్రకారం నుగాగమం వస్తుంది కానీ,ద్విత్వం రావడం లేదు.

దీనికి కారణం 'క్రొ' అక్షరానికి పరుషాక్షరాలు పరమైనపుడు మాత్రమే 'నుగాగమం' వస్తుందని అర్థమవుతున్నది.

క్రొత్త+చాయ ~క్రొ+ చాయ ~ క్రొ+న్+చాయ ~ క్రొంజాయ 

(సమాసం లో ద్రుతానికి స్వత్వరూపం లేనందున 'క్రొనుజాయ' ; 22 వ సూత్రం ప్రకారం అరసున్న లేనందున 'క్రొఁజాయ' 36 వ సూత్రం లోని వివరణ ననుసరించి సంశ్లేష లేనందున ' క్రొన్జాయ' అను రూపాలు ఏర్పడవు.)

క్రొంజెమట, క్రొంబసిడి రూపాలు పై విధంగానే ఏర్పడుతాయి.

'క్రొక్కారు' అనుచోట మొదట 'క్రొత్త+ కారు' అని ఉంటుంది.ఈ సూత్రం ప్రకారం ద్విత్వం వచ్చింది.

ఇదేవిధంగా ' క్రొత్తావి' కూడా.


పరుషాక్షరాలు ఇతరములైన వర్ణాలు పరమైనపుడు,నుగాగమం రాదు . 'ద్విత్వం' మాత్రమే వస్తుంది.

క్రొత్త + గండి = క్రొగ్గండి

క్రొత్త + నన = క్రొన్నన 

క్రొత్త + మావి= క్రొమ్మావి

ఇవి కాక ,

కెంధూళి,కెంజడలు అని కవి ప్రయోగాలున్నాయి.

ఇవి సూత్రములకు లొంగని ప్రయోగములని చిన్నయసూరి గారు తెలియజేశారు.

కెంపు+జడలు= కెంజడలు అనుచోట రెండూ ఆచ్ఛిక పదాలే .

అయినప్పటికీ ' జడలు ' లోని మొదటి అక్షరం సరళం కాబట్టి, సూత్రం ప్రకారం సరళాలు పరమైనపుడు ద్విత్వం రావాలి.అలా వస్తే' కెజ్జడలు' అనే అసాధురూపం యేర్పడుతుంది.

కాబట్టి, సూత్రానికి లొంగని రూపమని చూపించారు.


 *క్రొత్త కుండలు* 


క్రొత్త కుండలు అన్నప్పుడు 'క్రొత్త ' లోని 'త్త' లోపించలేదు.

రెండవ పదంలో పరుషాక్షరం (క) ఉంది.దానికి నకారంగాని,ద్విత్వం గాని రాలేదు.దానికి కారణం ప్రాతాది సూత్రంలో 'బహుళము ' అని చెప్పడం వల్లనే.

'ప్రయోగశరణం వ్యాకరణం 'అన్నట్లు ప్రయోగాల ననుసరించి ఈ వ్యాకరణ కార్యాలు చేయవలసి ఉంటుంది.

అందువల్లనే, 

క్రిందు+ కడుపు= క్రీఁగడుపు

క్రిందు+ కాలు = క్రీఁగాలు

క్రిందు+ తొడ = క్రీఁదొడ

వంటి పదాలలో లోపించగా మిగిలిన 'క్రి' అను అక్షరానికి దీర్ఘం వచ్చి 'క్రీ' అయినది.

ఈ దీర్ఘాన్ని ఏ సూత్రం విధించలేదు.

సూత్రంలో 'బహుళము' అని చెప్పినందువల్ల ఇవి సాధ్యమైనవని గ్రహించాలి.


సూత్రం.4 :

అన్యంబులకు సహితమిక్కార్యంబులు కొండొకచో కానంబడియెడి.(సంధి.సూ.39)


ప్రాతాదులకంటే వేరయిన పదాలకు కూడా సూత్రాలచే సాధింపబడని (లోప నుగాగమములు,లోప ద్విత్వములు) కార్యములు కనబడుతున్నవి.


పది+తొమ్మిది= పందొమ్మిది 

తొమ్మిది+ పది= తొంబది

వంక+ చెఱఁగు = వంజెఱఁగు

సగము+కోరు = సంగోరు 

నిండు+ వెఱ = నివ్వెఱ

నిండు+వెఱఁగు=నివ్వెఱఁగు

నెఱ + తఱి = నెత్తఱి

నెఱ + నడుము= నెన్నడుము 

నెఱ+ మది = నెమ్మది 

నెఱ + వడి = నెవ్వడి


'పందొమ్మిది ' అనుచోట 'పది' ప్రాతాదులలో చేసుకున్నప్పటికీ, మొదటి అక్షరం మాత్రమే మిగిలి,నుగాగమం వచ్చి,ద్రుతకార్యాలైన నిండు సున్న,సరళాదేశాలు వచ్చాయి.

(పది+తొమ్మిది ~ప+తొమ్మిది ~ప+న్+తొమ్మిది ~పందొమ్మిది)


'నివ్వెఱ' మున్నగు పదాలకు లోపము, ద్విత్వము వచ్చి సాధు రూపాలు ఏర్పడినవి.

(ఆధారం: బాలవ్యాకరణం లఘుటీఁక.)

Tuesday, May 9, 2023

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులు

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులు ఎనిమిది భాగాలు ఒకే దగ్గర చేర్చడమైనది కావలసినవారు ఆ రంగు లింకులు పైన టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -1 కొఱకు 👇

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు-1.pdf’

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -2 కొఱకు 👇

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -3 కొఱకు 👇

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -4 కొఱకు 👇

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -5 కొఱకు 👇

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -6 కొఱకు 👇

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -7 కొఱకు 👇

శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు -8 కొఱకు 👇

సంస్కృత -సంధులు సూత్రాలు , ఉదాహరణలు

 సవర్ణదీర్ఘ సంధి:- అ-ఇ-ఉ-ఋలకు అవే అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని సవర్ణదీర్ఘ సంధి అంటారు.

 ఉదాహరణలు:- రామ + ఆజ్ఞ = రామాజ్ఞ

                       మహి + ఈశుడు = మహీశుడు

                     గురు + ఉపదేశం = గురూపదేశం.


గుణ సంధి:- అకారానికి ఇ-ఉ-ఋలు పరమైతే క్రమంగా ఏ-ఓ-అర్‌లు ఏకాదేశమవడాన్ని గుణసంధి అంటారు.


ఉదా: సూర్య + ఉదయం = సూర్యోదయం

         మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు

           రాజ + ఋషి = రాజర్షి.


వృద్ధి సంధి:- అకారానికి ఏ, ఐలు పరమైతే ఐకారాన్ని; ఓ, ఔలు పరమైతే ఔకారాన్ని; ఋ, ౠలు పరమైతే ఆర్ ఏకాదేశమవడాన్ని వృద్ధి సంధి అంటారు. ఐ, ఔలను వృద్ధులు అంటారు. ఉదా: భువన + ఏక = భువనైక

         అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్యం

        పాప + ఓఘం = పాపౌఘం

        పరమ + ఔషధం = పరమౌషధం

        ఋణ + ఋణం = ఋణార్ణం


యణాదేశ సంధి:- ఇ-ఉ-ఋలకు అసవర్ణాచ్చులు పరమైతే క్రమంగా య-వ-రలు ఆదేశమవడాన్ని యణాదేశ సంధి అంటారు.  యణ్ణులు అనగా (య-వ-ర) లు పరమవుతున్నందు వలన ఇది యణాదేశ సంధి. 

ఉదా: అతి + ఉత్సాహం = అత్యుత్సాహం

         అణు+ఆయుధం = అణ్వాయుధం

       పితృ + ఆర్జితం = పిత్రార్జితం.


జశ్త్వ సంధి:- క-చ-ట-త-ప లకు అచ్చులు కానీ, హ-య-వ-ర-లు కానీ, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ, పరమైతే గ, జ, డ, ద, బ లు ఆదేశమవడాన్ని జశ్త్వసంధి అంటారు. 

      (లేదా)

  పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు, శ,ష, స లు కాకుండా మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశం అవుతాయి

  ఉదా: తత్ + అరణ్యం = తదరణ్యం

అచ్ + అంతం = అజంతం

వాక్ + ఈశుడు = వాగీశుడు

సత్ + భావం = సద్భావం.


శ్చుత్వ సంధి:- సకార ‘త’ వర్గాలకు (సకార-త థ ద ధ న) (త వర్గం) శకార ‘చ’ వర్గాలు (శకార – చ ఛ జ ఝ ఞ) (చవర్గం) పరమైనప్పుడు శకార ‘చ’ వర్గాలే ఆదేశమవడాన్ని శ్చుత్వ సంధి అంటారు.; ఉదా: తపస్ + శమము = తపశ్శమము (స్(స)+శ= శ్శ)

సత్+చరిత్ర=సచ్ఛరిత్ర(త్ (త) – చ= చ్ఛ) సత్+జనుడు= సజ్జనుడు (త్ (త)+జ= జ్జ)


అనునాసిక సంధి:- వర్గ ప్రథమాక్షరాలకు (క-చ-ట-త-ప) ‘న, మ’ అనునాసిక లు పరమైనప్పుడు ఆయా వర్గానునాసికాలు రావడాన్ని అనునాసిక సంధి అంటారు.

 ఉదా: వాక్ + మయం = వాఙ్మయం

        జగత్ + నాటకం = జగన్నాటకం

        రాట్ + మయం = రాణ్మయం.

Saturday, May 6, 2023

సంధులు వివరణ 1.అత్వ సంధి. 2. ఇత్వ సంధి. 3. ఉత్వ సంధి. 4. యడాగమ సంధి. 5.ఆమ్రేడిత సంధి. 6.గ, స, డ, ద, వా దేశ సంధి. 7సరళాదేశ సంధి. 8.. ద్విరుక్తటకార సంధి.9. పుంప్వాదేశ సంధి10. టుగాగమ సంధి. 11.రుగాగమ సంధి. 12.నుగాగమ సంధి.13.పడ్వాది సంధి 14. త్రిక సంధి15. ప్రాతాది సంధి.16.లు-ల-న ల సంధి.

సంధులు

సంధి :  పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధియగు.


వివరణ : పూర్వస్వరం అనగా మొదటి పదం చివరి అచ్చు, పరస్వరం అనగా రెండవ పదం మొదటి అచ్చు
                కలిసినప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

సంధులు రకాలు :
వర్ణాలబట్టి సంధులు రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి.
భాషనిబట్టి సంధులు రెండు రకములు: 1. సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.
తెలుగు సంధులు :  ఇవి రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి
అచ్చు సంధులు :
1. అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు. (ఇక్కడ బహుళము అనగా నాలుగు రకాల అని అర్థం) అత్వ సంధి నాలుగు విధాలుగా జరుగుతుంది.
  I) ప్రవృత్తి : ఈ సందర్భంలో సంధి నిత్యము జరుగుతుంది 
 ఉదా: మల్ల+అన్న =మల్లన్న.
  II) అప్రవృత్తి(నిషేధం) : అప్రవృత్తి అంటే వ్యాకరణ నియమం పాటించకపోవడం
 ఉదా: అక్క+ఇచ్చెను=అక్కయిచ్చెను.
 III)విభాష: సంధి ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగకపోవచ్చు
ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు/
        మేన+అల్లుడు=మేనయల్లుడు

 IV) అన్య విధము: వ్యాకరణ సూత్రం పాటించకుండా వేరొక విధంగా సంధి జరుగుతుంది
   ఉదా: ఒక + ఒక= ఒకానొక 

2. ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
   ఉదా: ఏమి + అనిరి =ఏమనిరి.
3. ఉకార సంధి: ఉత్తునకు సంధి నిత్యం
    ఉదా: రాముడు+అతడు=రాముడతడు.
4. యడాగమ సంధి: సంధిలేని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
    ఉదా: మీ+ఇల్లు=మీయిల్లు
 5. ఆమ్రేడిత సంధి: అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
     ఉదా: ఏమి+ఏమి=ఏమేమి.
            చివర + చివర= చిట్టచివర
            కడ + కడ = కట్టకడ
హల్లు సంధులు : ను
6. గసడదవాదేశ సంధి:
     సూత్రం 1: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వలు ఆదేశమగు.
            ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె
                 నిజము+తెలిసి = నిజముదెలిసి
     సూత్రం 2: ద్వంద్వ సమాసంలోని క,చ,ట,త,ప లకు క్రమంగా గ,స,డ,ద,వ లు వస్తాయి.
         ఉదా: తల్లి+తండ్రులు= తల్లిదండ్రులు
7. సరళాదేశ సంధి:1. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు
2. ఆదేశ సరళములకు  ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాసలగు.
       ఉదా:పూచెన్+కలువలు=పూచెన్గలువలు
8. ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు
    ద్విరుక్త టకారంబగు.
          ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు
                చిఱు + ఎలుక = చిట్టెలుక
9. పుంప్వాదేశ సంధి: కర్మధారయము నందు మువర్ణకంబునకు పుం-పు లగు
      ఉదా: సరసము+మాట=సరసపుమాట
             ముత్యము+చిప్ప=ముత్యపుచిప్ప
10. టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.
     ఉదా: పేరు+ఉరము=పేరుటురము
            నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.
11. రుగాగమ సంధి: కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు 
      రుగాగమంబగు (పేద,బీద,ముద్ద,బాలింత,జవ,కొమ,గొడ్డ...మొదలయినవి.)
        ఉదా: పేద+ఆలు=పేదరాలు
12. నుగాగమ సంధి:
     సూత్రం 1: ఉదంతంబులగు స్త్రీ సమంబులకు, పు,ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు
              నుగాగమంబగు.
           ఉదా: సొగసు+తనము=సొగసుందనము
    సూత్రం 2: ఉదంతంబగు తద్ధర్మార్థ విశేషణములకు అచ్చు పరంబగునప్పుడు నుగాగమంబగు
        ఉదా: చేయు+అతడు =చేయునతడు
              వచ్చు+అప్పుడు =వచ్చునప్పుడు
   సూత్రం 3: షష్ఠీ సమాసము నందు ఉకార, ఋకారములకు అచ్చు పరమగునపుడు నుగాగమంబగు.
        ఉదా: విధాతృ+ఆనతి =విధాతృనానతి
13. పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణకంబునకు లోపము, పూర్ణ బిందువులు
     విభాషనగు.
     ఉదా: భయము+పడు=భయపడు
14. త్రిక సంధి:   1.ఆ,ఈ,ఏ లను త్రికములు అంటారు.
                   2.త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు బహుళంబుగానగు.
                  3.ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబైన దీర్ఘము హ్రస్వంబగు
     ఉదా: ఆ+కడ = అక్కడ
      (ఇక్కడ '' అనునది .త్రికము, '' అనునది అసంయుక్త హల్లు. కనుక ద్విరుక్తంబు వచ్చిఆ+క్కడ ఐనది.
       ద్విరుక్తంబగు 'క్క' పరంబుగనప్పుడు '' దీర్ఘం కాస్త హ్రస్వంబై '' గా మారి అక్కడ అయ్యింది.)
15. ప్రాతాది సంధి: సమాసంబులనందు ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు
      బహుళంబుగానగు.(ప్రాత,క్రొత్త,లేత,క్రిందు,మీద,పువ్వు,కెంపు,చెన్నుమొదలయినవి.)
        ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.
16.లు-ల-న ల సంధి: లు-ల-న లు పరమైనపుడు ఒకానొకప్పుడు మువర్ణానికి లోపము దాని పూర్వ
     స్వరానికి దీర్ఘము విభాషగా వస్తాయి.
    ఉదా: దేశము+లు=దేశాలు

Friday, May 29, 2020

విద్య నిగూఢ గుప్తమగు విత్తము



విద్య నిగూఢ గుప్తమగు విత్తము






విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్ 
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్ 
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, 
విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే..? 

తాత్పర్యం : 
విద్య అనేది మనం రహస్యంగా దాచిపెట్టుకునే ధనం లాంటిది. అంటే.. చదువుకున్నవారైతే మీకున్న గుప్త ధనం చదువేనన్నమాట. మానవులకు చదువు అందాన్నిస్తుంది.. కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. 

విద్యయే గురువు, విదేశాలలో బంధువు, విద్య గొప్ప దైవం . ఈ భూమిమీద విద్యకు సాటి అయిన ధనం ఏదీ లేదు. పాలకుల చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అని పద్యం యొక్క భావం

10th class modelpaper 1

          మాదిరి ప్రశ్నపత్రం -1              

ప్రభుత్వ ఉన్నత పాఠశాల

I. అవగాహన – ప్రతిస్పందన ( 16 మార్కులు )

1. క్రింది పద్యాలలో ఒక దానికి ప్రతిపదార్థం రాయండి.         1x4=4    

     శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో స్నిగ్ధాంబుదచ్ఛాయలో

     నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గౌ

     రవముల్ వాఱఁగఁ జూచి పల్కె వనితారత్నంబు లీ భవ్యహైం

     దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా!తప్పు సైరింపుమీ!”

                           లేదా

    నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా

    నీరము మత్యమట్లు నళనీదళ సంస్థితమై తనర్చునా

    నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్

   పౌరుష వృత్తులిట్లధమ మధ్యమ నుత్తము గొల్చువారికిన్

2.  క్రింది పద్యాలలో ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి.       1x4=4

     దెసలను కొమ్మలొయ్య.........................సముత్సుకాకృతిన్.

                           లేదా

     తనచూపంబుధిమీద.........................గుప్పించి లంఘించుచోన్

క్రింది పరిచిత గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.         4X1=4

                  జీవనార్థము మిక్కిలి యాయాసంపాటు వ్యర్థము. నీవు సకల ధర్మములు తెలిసినవాడవు. నీకు విస్తరంచ చెప్పఁబని లేదు. నీకు లఘుపతనకుఁడు నేనొకఁడనుగాము. మనలను మూవురను దైవమొక్కచోఁజేర్చెను. దొరికినంతటితోఁ గాలము గడుపుకొని సుఖముగా జీవింతము, అనిన హిరణ్యకుఁడు మిక్కిలి సంతోషించి యిట్లనియె.  మంథరా నీవచనామృతము వర్షించి నా దురంతతాపము నివారించితివి. నేను ధన్యుడనయితిని. మిత్రలాభమను లాభసంపదయను వచనమునేడు నాకు లక్ష్యసమన్వితమయ్యెను.

ప్రశ్నలు :

   3. “జీవనార్థము.......జీవింతుము.మాటలు ఎవరు పలికారు ?

   4. మంథరుడు ఏమి వర్షించాడు ?

   5. పై పేరా దేని గురించి తెలుపుతుంది ?

   6. పై పేరా నుండి ఒక ప్రశ్నను తయారు చేయండి.

ఈ క్రింది పరిచిత పద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.        4x1=4

    గిరికార్ముకనిర్గతమై

    హరిశరమపు డసురవరపురాభిముఖంబై

    సురగరుడదురవలోక

    త్వరతోఁ జనె నొకమహారవంబుదయింపన్

ప్రశ్నలు :

    7. హనుమంతుని దేనితో పోల్చారు ?

    8. పై పద్యం లో లంక అనే అర్థం వచ్చే పదం గుర్తించండి.

    9. పై పద్యం సన్నివేశం తెలియజేయండి.

   10. పై పద్యం నుండి ఒక ప్రశ్నను తయారు చేయండి.

II.  వ్యక్తీకరణ – సృజనాత్మకత  (22 మార్కులు)

  ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి       7x2=14

   11. దీపాలదిన్నె గురించి రాయండి.

   12. మనుషులు ఎవరిని చేరితే ఏ విధంగా మారుతారో వివరించండి. 

   13. సంసారవిష వృక్షమునకు గల ఫలములు గూర్చి రాయండి.

   14. కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?

   15. వెన్నెల పాఠం నేపథ్యం రాయండి.

   16. పీఠిక ప్రక్రియ గూర్చి రాయండి.

   17. హనుమంతుని చేష్టలను పరిచయం చేసిన కవి గూర్చి తెలపండి.

 ఈ క్రింది ప్రశ్నలకు 10 లేదా 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి                     2x4=8

    18. స్త్రీలు పూజింప దగినవారు అని చెప్పిన శివాజి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.

                                                     (లేదా)

            కోపం మనిషికి విచక్షణ లేకుండా చేస్తుందని భిక్ష పాఠం ఆధారంగా వివరించండి.

    19. రాజధాని గా వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.

                                            (లేదా)

       మకుటంలేని మహారాజైన వృద్ధునికి, అదృష్టవంతుడైన యువకువకునికి మద్య గల సంబంధాన్ని వివరించండి.

III. భాషాంశాలు (12మార్కులు)

    20. మిమ్ముమాధవుడు రక్షించు గాక!”

           పై వాక్యంలోని అలంకారం గుర్తించి, అలంకార లక్షణం రాయండి.                            (2మార్కులు)

     21. ఈ క్రింది పద్య పాదాలలో ఒక దానికి గణవిభజన చేసి, పద్యలక్షణావ్వి సమన్వయం చేయండి.  4x1=4

          సరసముగా నటింపఁగ నిశాసతికెత్తిన క్రొత్తతోఁపుఁబెం

                                (లేదా)

          జననీ! హైందవ భూమి నీ పగిది దుశ్చారిత్రముల్ సాగునే?

      ఈ క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా సమాధానాలు రాయండి.          (12x1/2=6)

      22.  ఇతరులకు మర్మము చెప్పకూడదు.

            గీతగీసిన పదానికి క్రింది వాటిలో సరైన అర్థాన్ని గుర్తించండి.

            నిజము , రహస్యం , విశేషం

      23. కౌముది రాత్రి అనే ఆలోచనను రానివ్వలేదు.

           గీతగీసిన పదానికి సరైన అర్థాన్ని రాయండి.

     24. గగనం చీకటితో ఆవరించబడింది. నింగిలో నక్షత్రాలు మెరుస్తున్నాయి.

           గీతగీసిన పదాలకు సరైన పర్యాయపదాలు గుర్తించండి.

          అ) ఆకాశం, మేఘం             ఆ) మిన్ను, ఆకాశం

          ఇ) అంబరం, అంబుధి           ఈ) నేల, వాయువు

    25. ఆమె చక్షువులు కలువరేకుల్లా ఉన్నాయి. ఆ నయనాలను వర్ణించలేము.

          పై వాక్యములలోని పర్యాయపదాలను గుర్తించి రాయండి.

    26. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.

          గీతగీసిన పదానికి సరైన నానార్థాలు రాయండి.

    27. వనజము పగటిసమయంలో మాత్రమే వికసిస్తుంది.

          గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థము రాయండి.

    28. ఊరేగింపు కార్యక్రమంలో శబ్దం కాలుష్యమవుతుంది.

          గీతగీసిన పదానికి క్రింది పదాల నుండి సరైన వికృతిని గుర్తించండి.

              చప్పుడు        సద్దు     గొడవ

   29.  సముద్రం ఎన్నో జీవులకు నిలయం.

         గీతగీసిన పదానికి సరైన ప్రకృతిని రాయండి.

   30.  సులోచనకి పాలమీఁగడ అంటే చాలా ఇష్టం. 

          గీత గీసిన పదాన్ని సంధి విడదీసి రాయండి.

   31.  ప్రకృతి దృశ్యాలు మనోహరం గా ఉంటాయి.

         గీతగీసిన పదంలోని సంధిని గుర్తించండి.

   32. విద్యార్థులు ప్రతిదినము ప్రార్ధన చెయ్యాలి.

        గీతగీసిన పదం ఏసమాసమో గుర్తించండి. 

   33. క్రింది వాక్యంలో షష్టీతత్పురుష సమాసాన్ని గుర్తించండి.

        విశ్వంలో మానవచరిత్రకు ఎన్నో ప్రముఖదినాలు ఉన్నాయి