మాదిరి ప్రశ్నపత్రం -1
ప్రభుత్వ ఉన్నత పాఠశాల
I. అవగాహన – ప్రతిస్పందన ( 16 మార్కులు )
1. క్రింది పద్యాలలో ఒక
దానికి ప్రతిపదార్థం రాయండి. 1x4=4
శివరాజంతట మేల్ముసుంగుఁ దెరలో
స్నిగ్ధాంబుదచ్ఛాయలో
నవసౌదామినిఁ బోలు నా యవనకాంతారత్నమున్ భక్తి
గౌ
రవముల్ వాఱఁగఁ జూచి పల్కె “వనితారత్నంబు లీ భవ్యహైం
దవభూజంగమ పుణ్యదేవతలు; మాతా!తప్పు సైరింపుమీ!”
లేదా
నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరము మత్యమట్లు నళనీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత
ప్రభన్
పౌరుష వృత్తులిట్లధమ మధ్యమ నుత్తము
గొల్చువారికిన్
2. క్రింది పద్యాలలో
ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. 1x4=4
దెసలను
కొమ్మలొయ్య.........................సముత్సుకాకృతిన్.
లేదా
తనచూపంబుధిమీద.........................గుప్పించి
లంఘించుచోన్
క్రింది పరిచిత గద్యాన్ని
చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 4X1=4
జీవనార్థము మిక్కిలి యాయాసంపాటు
వ్యర్థము. నీవు సకల ధర్మములు తెలిసినవాడవు. నీకు విస్తరంచ చెప్పఁబని లేదు. నీకు
లఘుపతనకుఁడు నేనొకఁడనుగాము. మనలను మూవురను దైవమొక్కచోఁజేర్చెను. దొరికినంతటితోఁ
గాలము గడుపుకొని సుఖముగా జీవింతము, అనిన హిరణ్యకుఁడు మిక్కిలి సంతోషించి
యిట్లనియె. మంథరా నీవచనామృతము వర్షించి నా
దురంతతాపము నివారించితివి. నేను ధన్యుడనయితిని. ”మిత్రలాభమను లాభసంపద”యను వచనమునేడు నాకు
లక్ష్యసమన్వితమయ్యెను.
ప్రశ్నలు :
3.
“జీవనార్థము.......జీవింతుము.” మాటలు ఎవరు పలికారు ?
4. మంథరుడు ఏమి వర్షించాడు ?
5. పై పేరా దేని గురించి తెలుపుతుంది ?
6. పై పేరా నుండి ఒక ప్రశ్నను తయారు చేయండి.
ఈ క్రింది పరిచిత పద్యాన్ని
చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
4x1=4
గిరికార్ముకనిర్గతమై
హరిశరమపు డసురవరపురాభిముఖంబై
సురగరుడదురవలోక
త్వరతోఁ జనె నొకమహారవంబుదయింపన్
ప్రశ్నలు :
7. హనుమంతుని దేనితో పోల్చారు ?
8. పై పద్యం లో లంక అనే అర్థం వచ్చే పదం
గుర్తించండి.
9. పై పద్యం సన్నివేశం తెలియజేయండి.
10. పై పద్యం నుండి ఒక ప్రశ్నను తయారు చేయండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
(22 మార్కులు)
ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో
సమాధానాలు రాయండి 7x2=14
11. దీపాలదిన్నె గురించి రాయండి.
12. మనుషులు ఎవరిని చేరితే ఏ విధంగా మారుతారో
వివరించండి.
13. సంసారవిష వృక్షమునకు గల ఫలములు గూర్చి
రాయండి.
14. కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది అనడంలో కవి
ఉద్దేశం ఏమిటి ?
15. వెన్నెల పాఠం నేపథ్యం రాయండి.
16. పీఠిక ప్రక్రియ గూర్చి రాయండి.
17. హనుమంతుని చేష్టలను పరిచయం చేసిన కవి
గూర్చి తెలపండి.
ఈ క్రింది ప్రశ్నలకు 10 లేదా 12 వాక్యాల్లో
సమాధానాలు రాయండి 2x4=8
18. స్త్రీలు పూజింప దగినవారు అని చెప్పిన
శివాజి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
(లేదా)
కోపం మనిషికి
విచక్షణ లేకుండా చేస్తుందని భిక్ష పాఠం ఆధారంగా వివరించండి.
19. రాజధాని గా
వెలుగొందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి.
(లేదా)
మకుటంలేని
మహారాజైన వృద్ధునికి, అదృష్టవంతుడైన యువకువకునికి మద్య గల సంబంధాన్ని వివరించండి.
III. భాషాంశాలు (12మార్కులు)
20. “మిమ్ముమాధవుడు రక్షించు గాక!”
పై వాక్యంలోని అలంకారం గుర్తించి,
అలంకార లక్షణం రాయండి.
(2మార్కులు)
21. ఈ క్రింది పద్య పాదాలలో ఒక దానికి
గణవిభజన చేసి, పద్యలక్షణావ్వి సమన్వయం చేయండి.
4x1=4
సరసముగా నటింపఁగ నిశాసతికెత్తిన
క్రొత్తతోఁపుఁబెం
(లేదా)
జననీ! హైందవ భూమి నీ పగిది
దుశ్చారిత్రముల్ సాగునే?
ఈ క్రింది
ప్రశ్నలకు సూచించిన విధంగా సమాధానాలు రాయండి. (12x1/2=6)
22. ఇతరులకు
మర్మము చెప్పకూడదు.
గీతగీసిన పదానికి క్రింది వాటిలో సరైన
అర్థాన్ని గుర్తించండి.
నిజము
, రహస్యం , విశేషం
23. కౌముది రాత్రి అనే
ఆలోచనను రానివ్వలేదు.
గీతగీసిన పదానికి సరైన అర్థాన్ని
రాయండి.
24. గగనం చీకటితో
ఆవరించబడింది. నింగిలో నక్షత్రాలు మెరుస్తున్నాయి.
గీతగీసిన పదాలకు సరైన పర్యాయపదాలు
గుర్తించండి.
అ) ఆకాశం,
మేఘం ఆ) మిన్ను, ఆకాశం
ఇ) అంబరం, అంబుధి ఈ) నేల, వాయువు
25. ఆమె చక్షువులు కలువరేకుల్లా ఉన్నాయి. ఆ
నయనాలను వర్ణించలేము.
పై వాక్యములలోని పర్యాయపదాలను గుర్తించి రాయండి.
26. కృషి
ఉంటే మనుషులు ఋషులవుతారు.
గీతగీసిన పదానికి సరైన నానార్థాలు రాయండి.
27. వనజము పగటిసమయంలో మాత్రమే
వికసిస్తుంది.
గీతగీసిన పదానికి సరైన వ్యుత్పత్యర్థము
రాయండి.
28. ఊరేగింపు కార్యక్రమంలో శబ్దం
కాలుష్యమవుతుంది.
గీతగీసిన పదానికి క్రింది పదాల నుండి సరైన
వికృతిని గుర్తించండి.
చప్పుడు సద్దు
గొడవ
29. సముద్రం ఎన్నో జీవులకు నిలయం.
గీతగీసిన
పదానికి సరైన ప్రకృతిని రాయండి.
30. సులోచనకి
పాలమీఁగడ అంటే చాలా ఇష్టం.
గీత గీసిన పదాన్ని సంధి విడదీసి
రాయండి.
31. ప్రకృతి దృశ్యాలు మనోహరం గా
ఉంటాయి.
గీతగీసిన పదంలోని సంధిని గుర్తించండి.
32. విద్యార్థులు ప్రతిదినము
ప్రార్ధన చెయ్యాలి.
గీతగీసిన పదం ఏసమాసమో గుర్తించండి.
33. క్రింది వాక్యంలో షష్టీతత్పురుష సమాసాన్ని
గుర్తించండి.
విశ్వంలో మానవచరిత్రకు ఎన్నో ప్రముఖదినాలు
ఉన్నాయి